
బెంగళూరు: మీరు ఇళ్లలో నీలి చిత్రాలు చూడరా అంటూ మీడియాపై మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యడ్యూరప్ప శనివారం విరుచుకు పడ్డారు. ఆయన శివమొగ్గలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నీలి చిత్రాల అంశంపై విలేకరులు ఆయనను ప్రశ్నించారు. దీంతో ఆయన వారిపై విరుచుకు పడ్డారు. మీరు ఇళ్లలో రాత్రిపూట నీలి చిత్రాలు చూడరా తెలిసో తెలియకో కొందరు ఎమ్మెల్యేలు తప్పు చేశారు, దాన్ని ఎందుకు ఇంత పెద్దగా చేసి చూపుతారని ప్రశ్నించారు.
ఏ విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇవ్వాలని, నీలి చిత్రాల అంశం ఘటనను పత్రికలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడం సరికాదన్నారు. కాగా ఇటీవల అసెంబ్లీలో బిజెపికి చెందిన మంత్రులు నిండు సభలోనే నీలి చిత్రాలు చూస్తూ కెమెరాలకు చిక్కి పోయిన విషయం తెలిసిందే. వారిపై పార్టీ వేటు వేసింది.
ఏ విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇవ్వాలని, నీలి చిత్రాల అంశం ఘటనను పత్రికలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడం సరికాదన్నారు. కాగా ఇటీవల అసెంబ్లీలో బిజెపికి చెందిన మంత్రులు నిండు సభలోనే నీలి చిత్రాలు చూస్తూ కెమెరాలకు చిక్కి పోయిన విషయం తెలిసిందే. వారిపై పార్టీ వేటు వేసింది.














