
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదిలో మునిగి ఓ విద్యార్థి సోమవారం మృతి చెందాడు. రాజమండ్రిలోని కృష్ణ ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సూర్య మణి తేజ అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి ఉదయం పది గంటల ప్రాంతంలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లాడు. నదిలో ఈత కొడుతూ అతను లోతైన ప్రాంతానికి వెళ్లాడు.
లోతు ప్రాంతానికి వెళ్లడంతో వరద తాకిడి తట్టుకోలేక అతను నీళ్లలో మునిగి పోయాడు. అతనితో పాటే ఉన్న స్నేహితులు కూడా లోతు ప్రాంతానికి వెళ్లారు. వీరిని గమనించిన స్థానికులు విద్యార్థులను రక్షించారు. సూర్య తేజ అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
లోతు ప్రాంతానికి వెళ్లడంతో వరద తాకిడి తట్టుకోలేక అతను నీళ్లలో మునిగి పోయాడు. అతనితో పాటే ఉన్న స్నేహితులు కూడా లోతు ప్రాంతానికి వెళ్లారు. వీరిని గమనించిన స్థానికులు విద్యార్థులను రక్షించారు. సూర్య తేజ అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.













