వైయస్ ఏమయ్యారో చూశారు, వీరూ అంతే: బాబు

మంగళవారం, ఫిబ్రవరి 21, 2012, 14:43 [IST]
Chandrababu Naidu
హైదరాబాద్: శాసనసభ సమావేశాలను వాయిదా వేస్తూ పోతుండడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఇదే రకంగా చేసి వైయస్ ఏమయ్యారో చేశారని, వీరికి కూడా అదే అవుతుందని, ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారని, మిగిలి ఉన్న అసెంబ్లీని భ్రష్టు పట్టించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. శానససభా సమావేశాల తీరు చూస్తుంటే మొదటి సారి తనకు ఆవేదన, బాధ కలుగుతున్నాయని ఆయన అన్నారు.

శాసనసభ సమావేశాలు జరగకపోతే బాగుంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నారని ఆయన అన్నారు. సమావేశాలను నడపాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని ఆయన అన్నారు. రేపటి నుంచైనా అసెంబ్లీని సక్రమంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అది జరగకపోతే ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడానికి తాము ఏం చేయాలో అది చేస్తామని ఆయన అన్నారు. ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు శాసనసభలో చర్చకు రాకుండా చూస్తున్నారని ఆయన అన్నారు.

రాష్ట్రంలోని సంపదను దోచుకోవడంపై చూపుతున్న ఉత్సాహం అసెంబ్లీని నడిపించడంలో, ప్రజాసమస్యలను పరిష్కరించడంలో చూపడం లేదని ఆయన అన్నారు. అధికారం కోసం కాంగ్రెసు నాయకులు పనిచేస్తున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెసు అధికార దుర్వినియోగం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసు అవినీతి కార్యక్రమాలు నిర్ధారణ అవుతాయని ఆయన అన్నారు. అభివృద్ధి పథకాల్లో అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతుందని, విచారణ జరిపితే సగం మంది జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు.
English summary
TDP president N Chandrababu Naidu has expressed his anguish at CM Kiran kumar Reddy and speaker Nadendla Manohar.
User Comments
Srsr Velagala 21 Feb 2012 07:01 pm
పిచ్చకుక్కలనే కాదు రోడ్ మిద ఎవ్వడికి అక్కర లేకుండానే కాదు ఒకప్పుడు ఇంటి సునకాలని గూడా విధిన పడుతుంటాయి. వాటిని ఉపేక్షిస్తే ఎవ్వడినైన కరుస్తాయి కాబట్టి వెంటనే పారిసుబ్రత వాళ్ళు వాటిని పట్టుకుని కాల్చేస్తేనే ఉత్తమమ, లేక పొతే అమాయకంగా పది మందిని కాపాడే మనుషులుగూడ పోత్యారు.
robo 21 Feb 2012 05:08 pm
బాబు చనిపోయనవాని గురించి మాట్లాడకు రా ఈ రోజు కాక పోతే రేపు నీవు కూడా పోతావు రా నీవు ఎంత దుర్మర్గుదివో ప్రజలందరికీ తెలుసు పిల్ల నిచిన మామ నే చంపిన మంచి చరిత్ర రా నీది
bhaskar 21 Feb 2012 04:42 pm
అరె చంద్రబాబు నోరు పారేసుకోకు నీ కంటే నీచ రజకీయనాయకుడు ఇంకొకడు ఉండదు.నీవు పెద్ద గురిగింజవి.మాట్లాడటానికి సిగ్గు ఉండాలి.నీవు అన్నం కాదు తినేది ఇంకొకటి.......
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs