
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చిక్కుల్లో పడ్డారు. సుప్రీంకోర్టు మంగళవారం జయలలితకు నోటీసు జారీ చేసింది. 1992లో రూ. 2 కోట్ల రూపాయల విలువ గిఫ్ట్ కేసు ప్రొసిడింగ్స్ను కొట్టేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సిబిఐ సుప్రీంకోర్టు సవాల్ చేసింది. సిబిఐ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం జయలలితకు ఆ నోటీసు జారీ చేసింది.
Read: In English
నాలుగు వారాల్లోగా తమ నోటీసుకు వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు జయలలితను ఆదేశించింది. జయలలిత తన జన్మదిన వేడుకల సందర్భంగా అందుకున్న 89 డిమాండ్ డ్రాఫ్ట్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దాఖలు చేయడంలో ఏ విధమైన జాప్యం చేయలేదంటూ సిబిఐ హైకోర్టు తీర్పును సవాల్ చేసింది. చార్జిషీట్ దాఖలులో జాప్యం చేశారంటూ ఎఫ్ఐఆర్, చార్జిషీట్లను హైకోర్టు కొట్టేయడం సరి కాదని సిబిఐ తరఫున సుప్రీంకోర్టులో వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ హరీన్ రావల్ అన్నారు.












