26/11 సూత్రదారి హఫీజ్పై అమెరికా $10మి.ల రివార్డ్
హఫీజ్ సయిదా ఎఫ్బిఐ జాబితాలో మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది. ఇతను ప్రస్తుతం పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు భావిస్తున్నారు. స్టేట్ పొలిటికల్ సెక్రటరీ వెండీ షెర్మాన్ భారత్కు వచ్చినప్పుడు హఫీజ్ సయీద్ బంధువు అబ్దుల్ రెహ్మాన్ మక్కి పైన కూడా $3 మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించినట్లు చెప్పారు.
కొత్త అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి పైన $25 మిలియన్ డాలర్ల బహుమతి ఉంది. హఫీజ్ సయీద్ భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. 26/11 ముంబయి ఘటనలో ఇతని హస్తం ఉంది. ఇతని పైన పలు కేసులు ఉన్నాయి. హఫీజ్ పైన ఉన్న పలు కేసులను లాహోర్ కోర్టు తోసిపుచ్చింది.
కాగా 2008 నవంబర్ 26న ముంబయిలో పాక్ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. తాజ్ హోటల్ తదితర మూడు ప్రాంతాల్లో వారు దాడులు చేశారు. ఈ దాడిలో 185 మందికి పైగా చనిపోయారు. మన పోలీసులు చేసిన ఎదురు దాడిలో ఉగ్రవాదులు అందరూ చనిపోయారు. కసబ్ ఒక్కడే సజీవంగా పట్టుబడ్డాడు. అతను ఇప్పుడు జైలులో ఉన్నాడు.