వేరే కులస్థుడిని ప్రేమించిందని చెల్లిని చంపిన అన్న
స్థానికంగా ఉండే గంగన్న సోదరి లలిత చాపాడులో వ్యవసాయ విస్తరణ అధికారి(ఎఈవో)గా పని చేస్తోంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని తండ్రిని, తన సోదరుడిని కోరింది. వేరే కులస్థుడితో పెళ్లికి అంగీకరించని అన్న సోదరిని దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని కుందూ నదిలో పూడ్చి పెట్టాడు.
లలిత కొద్ది రోజులుగా కనిపించక పోవడంతో గాలింపు చేపట్టిన స్థానికులు, బంధువులు చివరకు సోదరుడు చేసిన దారుణాన్ని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకిదిగిన పోలీసులు మృతదేహం కోసం వెతుకులాట ప్రారంభించారు. చాపాడు నెరవాడ ప్రాంతంలోనే కుందూ నదిలో పోలీసులు ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. బాడీని పోస్టుమార్టం కోసం తరలించారు.
మృతురాలి సోదరుడు గంగన్నను, మరో బంధువును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లలిత అదే జిల్లాలో చాగలమర్రిలో ఏఈవోగా పని చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పరువు హత్యలు చాలా జరుగుతాయి. మన రాష్ట్రంలో పరువు హత్య చోటు చేసుకోవడం అందరినీ కలిచి వేస్తోంది.