ఇదే కార్యక్రమంలో మరో ప్రశ్నకు గాను బాలీవుడ్ సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్నట్లు తెలిపింది. సైనా నెహ్వాల్తో పాటు ఈ కార్యక్రమంలో లండన్ ఒలింపిక్స్లో మహిళల బాక్సింగ్లో కాంస్య పతకం నెగ్గిన మేరీకామ్ కూడా పాల్గొంది. బంగారు పతకం కోసం తాను తీవ్రంగా ప్రయత్నించానని.. కానీ కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పింది.
2016 రియో ఒలింపిక్స్లో తప్పకుండా బంగారు పతకం సాధించేందుకు కృషి చేస్తానని మేరీకామ్ చెప్పింది. భారత్కు ఒలింపిక్ పతకం సాధించిన రెండో మహిళ సైనా. తొలి పతకం కూడా రాష్ట్రానికే చెందిన కరణం మల్లీశ్వరి (వెయిట్లిఫ్టింగ్) 2000 సిడ్నీ ఒలింపిక్స్లో గెలిచింది. ఒలంపిక్స్లో కాంస్య పతకం సాధించిన మేరీ కామ్కు మణిపూర్ ప్రభుత్వం రూ.50 లక్షల నగదు ప్రోత్సహాకాన్ని ప్రకటించింది. అడిషనల్ ఎస్పీగా పదోన్నతితో పాటు.. మీటీ లాంగోల్ అనే ఊళ్లో రెండెకరాలు భూమిని కూడా ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
తెలుగు వన్ఇండియా