అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

1 నుండి 10 వరకు బాబే: పయ్యావుల, హరికృష్ణ పైనా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Payyavule Keshav
అనంతపురం: రాష్ట్ర రాజకీయాల్లో తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక్కరే ప్రత్యామ్నాయంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు కనిపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ బుధవారం అనంతపురం జిల్లాలో అన్నారు. రాష్ట్రంలో ఒకటి నుండి పది వరకు రాజకీయ నేతల అవసరం తీసుకుంటే చంద్రబాబు ఒక్కరే కనిపిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. నందమూరి, నారా కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు.

విభేదాలు ఉన్నాయని, లేవని అంతా చెప్పేది మీడియా మాత్రమే అన్నారు. రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ పాదయాత్రలో పాల్గొనడం తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పారు. పార్టీకి నందమూరి, నారా కుటుంబాలు రెండూ అవసరమేనని, ఆ రెండు కుటుంబాలు నాణేనికి రెండు వైపుల అనుకోవచ్చునని తెలిపారు. పాదయాత్రలో బాబుకు వస్తున్న ఆదరణ చూస్తుంటే 2014లో టిడిపి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, బాబు ముఖ్యమంత్రి అవుతారని గట్టిగా విశ్వసిస్తున్నామన్నారు.

చంద్రబాబు పాదయాత్రపై కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. ఆత్మహత్యల పేరుతో ఏళ్లకేళ్లకు ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న జగన్ పార్టీ బాబు పాదయాత్రను శవయాత్రతో పోల్చడం హేయమమన్నారు. శుభప్రదంగా జరుగుతున్న యాత్రను వారు అలా వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు.

English summary

 Telugudesam Party senior leader Payyavule Keshav said on Wednesday in Ananthapur district that TDP chief Nara Chandrababu Naidu is only alternative in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X