అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి ఇంటిమీదుగా బాబు: చేతులూపిన అనుచరులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - Raghuveera Reddy
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రలో మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చంద్రబాబు పాదయాత్రలో భాగంగా కళ్యాణదుర్గంలో మంత్రి రఘువీరా రెడ్డి ఇంటి మీదుగా వెళ్లారు. బాబు అటుగా వెళ్తున్న సమయంలో రఘువీరా అనుచరులు బాబు యాత్రను ఆసక్తిగా భవనం పైకి ఎక్కి తిలకించారు. అంతేకాదు పైనుంచి చేతులు ఊపారు. ఈ సమయంలో అక్కడకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. కళ్యాణదుర్గం మొత్తం పసుపుమయమైంది.

కాగా అంతకుముందు చంద్రబాబు పాదయాత్ర కళ్యాణదుర్గం శివార్లలోని ఎర్రంపల్లి క్రాస్ నుంచి ప్రారంభమైంది. చంద్రబాబు వెంట పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు వచ్చారు. ఈ రోజుతో బాబు యాత్ర ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఎర్రంపల్లి క్రాస్ వద్ద ఉదయం 10.45 నిమిషాలకు ప్రారంభమైన పాదయాత్ర కళ్యాణదుర్గం వైపుకు సాగింది. అక్కమ్మ దేవాలయంలో వద్ద వడ్డెర్ల సంఘం సభ్యులు ఆయనకు సంఘీభావం తెలిపారు.

ఓ సుత్తిని బహూకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. వడ్డెర్లను ఎస్సీల జాబితాలో చేర్చాలన్న వారి డిమాండుకు మద్దతు తెలిపారు. వడ్డెర్ల అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. కళ్యాణదుర్గంలోని వాల్మికీ విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు నివాళులు అర్పించారు. తాము అధికారంలోకి వస్తే వాల్మికీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

English summary

 Minister Raghuveera Reddy's followers wished Telugudesam Party chief Nara Chandrababu Naidu when his yatra passing by Raghuveera's residence at Kalyandurgam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X