అల్లుడామజాకా: జగన్తో రాబర్ట్వాద్రాను పోల్చిన బాబు
ఇక్కడ జగన్, అక్కడ వాద్రా ఒకేవిధంగా ప్రజల సొమ్మును దోచుకున్నారన్నారు. అల్లుడా మజాగా అని నిరూపించారని వాద్రాను ఉద్దేశించి అన్నారు. అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన ప్రజల సొమ్మును వీరు అవినీతికి పాల్పడి కొట్టేశారన్నారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలు చూసి తనకు నిద్ర పట్టడం లేదని, అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ నేతలకు ఎలా నిద్ర పడుతుందో తనకు అర్థం కావడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అనంతపురంలో చెక్ డ్యాంలు నిర్వహించామని, వాటి వల్లే ఇప్పుడు సాగు జరుగుతోందన్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరుతో భారీగా దోచుకున్నారని ఆరోపించారు. తాను దోచుకున్న దానిలో కొంత మేర ఖర్చు చేసినా రాష్ట్రంలో భూగర్భ జలాలు మెరుగయ్యేవి అన్నారు. కాగా అంతకుముందు చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర తొమ్మిదో రోజు బెళుగప్ప మండలం విరుపావల్లి నుండి ప్రారంభమైంది. 11 గంటల తర్వాత శీర్పి చేరుకొని తోటలు సాగు చేస్తున్న రైతుల సదస్సులో మాట్లాడారు.