వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లవర్స్తో లేచిపోతున్నారని: గర్ల్స్ సెల్ఫోన్ వాడితే ఫైన్
తాజాగా బీహార్లోనూ ఇది బయటపడింది. పెళ్లయిన యువతులు.. భర్తలను వదిలి ప్రేమికులతో లేచిపోతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు పంచాయతీ పేర్కొంది. యువతులు ఇతర కులాలు, మతాల వారిని ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటుండడంతో ఇటీవల రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వీరు అమ్మాయిలు భర్తలను వదిలి లేచిపోతున్నారని తీర్మానం చేశారు.
బీహార్లోని సుందర్వాడి పంచాయతీ ఈ తీర్మానం చేసింది. అమ్మాయిలు సెల్ఫోన్ వినియోగిస్తే పదివేలు జరిమానా విధించాలని నిర్ణయించింది. అయితే.. ఈ విషయం వార్తా పత్రికల్లో ప్రచురితం అయిన తర్వాతే తమకు తెలిసిందని, దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని అక్కడి బ్లాక్ డెవలప్మెంట్ అధికారి చెప్పారు.
Comments
English summary
Day after, Rajasthan village Panchayat had imposed ban over the use of mobile phones by girls, a self styled Bihar Panchayat on Monday levied a fine of Rs 10,000 on girls or women found using mobile phones.
Story first published: Tuesday, December 4, 2012, 10:38 [IST]