వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ పార్టీలోకి ఇద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యేలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

YSR Congress
హైదరాబాద్‌: ప్రకాశం జిల్లాలో కాంగ్రెసు పార్టీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అద్దంకి శానససభ్యుడు గొట్టిపాటి రవికుమార్‌తో పాటు దర్శి శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

గొట్టిపాటి రవికుమార్‌తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు, సీనియర్ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు శానససభ్యులు కూడా ఈ నెలాఖరులోగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని అంటున్నారు.

ఇదిలావుంటే, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుుడ, మాజీ ఎమ్మెల్సీ మల్లెల లక్ష్మీనారాయణ శనివారం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో వైయస్ జగన్‌ను కలిశారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కుమ్మక్కు కారణంగానే జగన్‌ను జైలులో పెట్టారని మల్లెల లక్ష్మీనారాయణ జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో అన్నారు. ప్రజలు జగన్ వెంట ఉన్నారని, తాను కూడా ఆ పార్టీకోసం పనిచేస్తానని ఆయన చెప్పారు.

జగన్ కోసం జనం సంతకం పేర కోటి సంతకాలు సేకరించాలనే లక్ష్యంలో భాగంగా విజయవాడకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గౌతం రెడ్డి లక్షకు పైగా సంతకాలు సేకరించారు. కేవలం మూడు రోజుల్లోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన సంతకాలు సేకరించారు. హైదరాబాదులోని లోటస్‌పాండులో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిసి 1.06 లక్షల సంతకాలతో ఉన్న పత్రాలను అందించారు.

English summary
It is said that Prakasam district Congress MLAs Gottipati ravikumar (Addanki) and Sivaprasad Reddy (Darsi) may join in YS Jagan's YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X