వీరప్పన్ అనుచరుల ఉరితీతపై సుప్రీంకోర్టు స్టే
రిట్ పిటిషన్పై విచారణను ఈ నెల 20వ తేదీన చేపట్టనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి అల్తమాస్ కబీర్, న్యాయమూర్తులు ఎఆర్ దావే, విక్రమ్జీలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. ఈ నలుగురి తరఫున న్యాయవాది సమిక్ నారాయణ్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నలుగురు అనుచరులు కూడా శనివారంనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జ్ఞానప్రకాష్, సైమన్, మీసేకర్ మాదయ్య, బిలావేంద్రన్లకు 2004లో మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. రెండు దశాబ్దాల క్రితం కర్ణాటకలోని పాలార్లో జరిగిన మందుపాతర పేలుళ్ల కేసులో వారికి కోర్టు ఆ శిక్ష విధించింది.
ఆ పేలుళ్లలో 22 మంది మరణించారు. ఈ కేసులో ఆ నలుగురికి 2001లో టాడా ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, వారికి మరణశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆ నలుగురు కూడా ప్రస్తుతం కర్ణాటకలోని బెల్గాం జైలులో ఉన్నారు.