ఇచ్చిన డబ్బడిగితే చెల్లెల్ని కట్టేసి కొట్టి వివస్త్రను చేశారు
చెల్లెలు డబ్బులు అడగటంతో ఆగ్రహానికి లోనైన ఆ సోదరులు ఆమెపై దాడి చేసి వివస్త్రను చేశారు. ఈ ఘటనలో చెల్లెలికి స్వల్పంగా గాయాలయ్యాయి. సోదరులు దురాఘతాన్ని గుర్తించిన స్థానికులు అడ్డుకున్నారు. వారిని పట్టుకునే ప్రయత్నాలు చేశారు. స్థానికులు అడ్డుకోవడంతో వారు అక్కడి నుండి పరారయ్యారు. పోలీసులు ఆమెను చికిత్స కోసం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
బాధిత మహిళ తన సోదరులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్లు ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుగా పది లక్షల రూపాయలు ఇచ్చింది. తన సొమ్ము చెల్లించాల్సిందిగా ఆమె సోదరులను పలుమార్లు అడగినా వారు స్పందించలేదు. తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను కూడా ఆశ్రయించింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టడమే కాకుండా వివస్త్రను చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పుదురువేడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న వ్యాన్, బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోవడంతో పాటు పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి.