ప్రేమకు యువతి బలి: భార్య గొంతు కోసిన భర్త
ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం జరిగింది. చీరాలలోని రాంనగర్ న్యూకాలనీలో భార్య కాపురానికి రావడం లేదని ఆగ్రహగించిన భర్త ఆమె గొంతు కోశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్యను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. భర్తకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకీ తీసుకున్నారు.
శ్రీశైలం పాతాళగంగలో మునిగిపోయి ఓ భక్తుడు మరణించాడు. పాతాళగంగలో పుణ్యస్నానం చేసేందుకు వెళ్లిన ఓ భక్తుడు ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో మునిగిపోయాడు. మృతుడిని కర్ణాటకకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా కాళహస్తిలోనే ఓ వ్యక్తి ఉరేసుకుని మరణించాడు. ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీరంగనాయుడు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల భాధను తట్టుకోలేక అతను అత్మబలిదానానికి పూనుకున్నట్లు చెబుతున్నారు.