సైకో: మద్యం తాగించి చీర కొంగుతో 13 మంది హత్య!
మెదక్ జిల్లా ఆరుట్లకు చెందిన రాములు జీవనోపాధి కోసం 15 ఏళ్ల కిందట హైదరాబాదుకు వచ్చాడు. పెళ్లైనా భార్యను తీసుకు రాకుండా ఒంటరిగా వచ్చాడు. శంషాబాద్, రాజేంద్ర నగర్, నార్సింగి ప్రాంతాల్లో రాళ్లు కొట్టే పని చేస్తుండేవాడు. 2002లో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులకే భార్య వదిలేసి వెళ్లిపోవడంతో మహిళలపై ద్వేషం పెంచుకున్నాడు. అప్పటి నుంచి సైకోలా మారి.. రాళ్లు కొట్టే పని చేస్తూనే అక్కడకు వచ్చే వివాహితులు, ఇళ్ల వద్ద ఒంటరిగా ఉండే మహిళలతో పరిచయం పెంచుకున్నాడు.
వారికి మద్యం తాగించి.. ఆ మత్తులో ఉండగానే చీరతో గొంతు బిగించి చంపేసేవాడు. ఇలా ఆరేళ్లలో ఎనిమిది మందిని హత్య చేశాడు. 2009లో నార్సింగిలో ఓ మహిళ హత్యను చేశాడు. కేసులో ఆధారాలు దొరకడంతో పోలీసులు రాములును అదుపులోకి తీసుకున్నారు. మహిళలను తానే చంపినట్లు అంగీకరించారు. దీంతో అతనిని చర్లపల్లి జైలుకు తరలించారు. తన మానసిక పరిస్థితి బాగాలేదంటూ జైలు నుండి ఎర్రగడ్డ ఆసుపత్రికి చేరాడు.
అక్కడి నుండి పారిపోయాడు. రాములుతో సహా మరో ఐదుగురు ఖైదీలు పారిపోయారు. వీరిలో ముగ్గురు దొరికారు. పరారైన వారిలో రాముడు ఒకడు. బయటకు వచ్చిన రాములు మరో ముగ్గురిని హత్య చేశాడు. ఇటీవల తిరుమలగిరి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న రాములను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.