సినీ హీరోయన్ శిరీష అదృశ్యం: ప్రకాశంలో డ్రైవర్ ఘోరం
గాంధీ ఆసుపత్రిలో శిశువు మాయం
సికింద్రాబాద్ గాంధీ అస్పత్రిలోని ప్రసూతి విభాగం నుంచి మగ శిశువు మాయమయ్యింది. కిడ్నాప్ చేశారంటూ శిశువు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే కేసును చేధించే నిందితురాలని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే నగరంలోని బోరబండకు చెందిన మహిళ శనివారం సాయంత్రం మగ శిశువుకు జన్మ నిచ్చింది.
గాంధీ ఆస్పత్రిలో ఓ మహిళా తమ వాళ్లు ఇక్కడ చికిత్స పొందుతున్నారని శిశువు తల్లితో పరిచయం చేసుకుని, ఆమె నిద్రపోతున్న సమయలో శిశువును మాయం చేసింది. పోలీసుల దర్యాప్తులో ఆమె తెనాలిలో ఉన్నట్లు కనుగొని ఆదివారం ఆమెను అరెస్టు చేశారు. శిశువు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సాయంత్రం నిందితురాలను అదుపులోకి తీసుకున్నారు. శిశువును కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.
లారీ డ్రైవర్ ఘాతుకం
ప్రకాశం జిల్లా నాగులప్పాడు మండలంలో ఓ డ్రైవర్ మద్యం మత్తులో లారీ నడిపి ఆరుగురి ప్రాణాలను బలితీసుకున్నాడు. ఒంగోలు - చీరాల రహదారిపై ఈ ఘోరం జరిగింది. చదలవాడ వద్ద లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అదే మండలం మద్దిరాలపాడు వద్ద మరో రెండు ఆటోలను ఢీకొట్టింది. ఇందులో నలుగురు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.