పెళ్లికి ప్రియుడు నో: రైలు కిందపడి టెక్కీ ఆత్మహత్య
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం నగరం మోతీనగర్కు చెందిన శ్రీనివాస రావు కుమార్తె ప్రియాంగ. ఆమె వయస్సు 22. కొద్ది రోజుల క్రితం హైదరాబాదుకు వచ్చిన ఆమె ఓ సాఫ్టువేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఎస్ఆర్ నగర్లో నివసిస్తున్నారు. ప్రియాంక సోదరుడు కూడా హైదరాబాదులోనే ఉంటూ చదువుకుంటున్నారు.
కాగా, ప్రియాంక ఇంటర్ చదువుతున్నప్పటి నుండి ఇంటి పక్కనే ఉంటున్న బంధువుల యువకుడిని ప్రేమించింది. తనను పెళ్లి చేసుకోమని ఆమె కోరింది. దానికి అతను నిరాకరించాడు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియాంక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని... జేమ్స్ స్ట్రీట్ - సంజీవయ్య నగర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటిఎస్ రైలు కిందపడి ఆత్మహ్య చేసుకుంది. మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లభించింది. దీని ఆధారంగా అడ్రస్ గుర్తించారు. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో పేర్కొంది. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.