వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జీ: కనిమొళి, రాజాకు బెయిల్, దయాళు అమ్మాళ్‌కూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించిన రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో మాజీ టెలికం మంత్రి ఏ రాజా, ఎంపీ కనిమొళి, ఏడుగురు నిందితులకు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణకు రాజా, కనిమొళి కోర్టుకు హాజరయ్యారు. కాగా, ఈ ఉదయం కరుణానిధి భార్య, కనిమొళి సవతి తల్లి దయాళు అమ్మాళ్‌కు కూడా బెయిల్ లభించింది.

2G: Dayalu Ammal, Kanimozhi, Raja granted bail

దయాళు అమ్మాల్‌కు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం రూ.5 లక్షల సొంత పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. అలాగే అదే మొత్తంతో ఇద్దరు ష్యూరిటీని ఇవ్వాలని చెప్పింది. అయితే, ఈ కేసులో తన పేరును తొలగించాలన్న దయాళు అమ్మాల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

దయాళు అమ్మాల్, రాజా, కనిమొళిలతో పాటు మరో ఏడుగురికి బెయిల్ మంజూరయింది. 2జీ కేసులో రాజా, కనిమొళి స్వాన్ టెలికాం ప్రమోటర్స్‌లతో పాటు పలువురి పేర్లను ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జీషీటులో పేర్కొంది. వీరి పైన మనీ లాండరింగ్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది.

English summary

 A special court on Wednesday granted bail to DMK chief M. Karunanidhi's wife Dayalu Ammal in a money laundering case relating to the allocation of 2G spectrum.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X