2జీ: కనిమొళి, రాజాకు బెయిల్, దయాళు అమ్మాళ్కూ
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించిన రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో మాజీ టెలికం మంత్రి ఏ రాజా, ఎంపీ కనిమొళి, ఏడుగురు నిందితులకు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణకు రాజా, కనిమొళి కోర్టుకు హాజరయ్యారు. కాగా, ఈ ఉదయం కరుణానిధి భార్య, కనిమొళి సవతి తల్లి దయాళు అమ్మాళ్కు కూడా బెయిల్ లభించింది.
దయాళు అమ్మాల్కు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం రూ.5 లక్షల సొంత పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. అలాగే అదే మొత్తంతో ఇద్దరు ష్యూరిటీని ఇవ్వాలని చెప్పింది. అయితే, ఈ కేసులో తన పేరును తొలగించాలన్న దయాళు అమ్మాల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
దయాళు అమ్మాల్, రాజా, కనిమొళిలతో పాటు మరో ఏడుగురికి బెయిల్ మంజూరయింది. 2జీ కేసులో రాజా, కనిమొళి స్వాన్ టెలికాం ప్రమోటర్స్లతో పాటు పలువురి పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జీషీటులో పేర్కొంది. వీరి పైన మనీ లాండరింగ్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది.