వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిలో 40వేలమంది ఆంధ్ర ఉద్యోగులు: శ్రీనివాస్,గౌడ్

|
Google Oneindia TeluguNews

40 thousand AP employees in Telangana says Srinivas Goud
హైదరాబాద్: తెలంగాణలో 40వేల మంది ఆంధ్రా ఉద్యోగులు ఉన్నారని గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవ అధ్యక్షులు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆయన సచివాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ జిల్లాల్లో పని చేస్తున్న ఆంధ్రా ఉద్యోగుల వివరాలను సేకరించడానికి టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేయగా, 40,378 మంది ఆంధ్ర ఉద్యోగులు ఉన్నట్టు సమాచారం అందిందని తెలిపారు.

గ్రామ స్థాయి నుంచి ప్రతి విభాగంలో ఉన్న వివరాలు సేకరించినట్టు చెప్పారు. ఉద్యోగుల కేటాయింపులో స్థానికతను ప్రామాణికంగా పాటించాలని కోరారు. ఉద్యోగుల విభజనలో తెలంగాణకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. ఏపి అసెంబ్లీ సమావేశాల కవరేజ్ కోసం నమస్తే తెలంగాణ విలేకరులకు పాస్‌లు ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇతర ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సంస్థలన్నింటికీ పాస్‌లు జారీ చేసిన ఏపి ప్రభుత్వం నమస్తే తెలంగాణకు మాత్రమే పాస్‌లు ఇవ్వకపోవడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు.

English summary
Telangana MLA Srinivas Goud on Thursday said that 40 thousand Andhra Pradesh employees in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X