మాయమాటలు: హోటల్ తీసుకెళ్లి అమ్మాయిపై రేప్
రాజేంద్రనగర్ ఏసిపి ముత్యం రెడ్డి కథనం ప్రకారం.. పాతబస్తీ ముస్తఫానగర్కు చెందిన యువతి(15) స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆ అమ్మాయి ఇంటి సమీపంలో ఉండే ఓ యువకుడు(17) ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
సెప్టెంబర్ 12న ఆమెకు మాయమాటలు చెప్పి తన ఇద్దరు మిత్రులతో కలిసి యువకుడు ఆ అమ్మాయిని తీసుకుని బస్సులో యాదగిరి గుట్టకు వెళ్లాడు. అక్కడ ఓ హోటల్లో గది తీసుకుని నిర్బంధించిన యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
సెప్టెంబర్ 16న రాత్రి ఇంటికి చేరుకున్న అమ్మాయిని తల్లిదండ్రులు విచారించడంతో విషయం తెలిసింది. బుధవారం బాధితురాలితో కలిసి తల్లిదండ్రులు మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కేసును యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కు అప్పగిస్తామని చెప్పారు.