విద్యార్థినిపై వాచ్మెన్ అత్యాచారం: పొరుగింటి మహిళపై..
పొరుగింటి మహిళపై అత్యాచారం
ముజఫర్నగర్: పొరుగింటి మహిళపై అత్యాచారం చేసిన ఓ వ్యక్తికి ముజఫర్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అఖిలేష్ అనే వ్యక్తి తమ పక్క ఇంట్లో ఉండే మహిళపై అత్యాచారం చేశాడు. అత్యాచారం నేరం కింద పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్ జిల్లా సిసోలిలో 2011, అక్టోబర్ 8వ తేదీన బాధితురాలిపై ఆమె ఇంట్లోనే అఖిలేష్ అత్యాచారం చేసినట్లు ప్రాసిక్యూషన్ వాదించడంతోపాటు నిరూపించింది. కోర్టులో అతడు నేరం చేసినట్లు రుజువు కావడంతో న్యాయమూర్తి హరీష్ త్రిపాఠి నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. రూ. 30వేల జరిమానా విధించారు.
Comments
English summary
A man allegedly raped a minor girl in a private school, in Hyderabad on Saturday.
Story first published: Saturday, July 12, 2014, 17:31 [IST]