రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్‌రేప్: వివస్త్రగా రోడ్డుపై

|
Google Oneindia TeluguNews

మెదక్: జిల్లాలోని కోహీర్ మండలం కవేలి శివారులో సోమవారం రాత్రి దారుణం జరిగింది. ఓ మతిస్థిమితం లేని మహిళ(32)పై ముగ్గురు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం మొరంగ్‌పల్లి గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ సోమవారం మునిపల్లి మండలం బుదేరా గ్రామంలోని సంతకు వెళ్లింది.

అక్కడ ఇద్దరు వ్యక్తులు ఆమెను బైక్‌పై కవేలి గ్రామ శివారుకు తీసుకెళ్లారు. అక్కడ వారితోపాటు మరో వ్యక్తి కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమెను చితకబాది పరారయ్యారు. తీవ్ర గాయాలతో వివస్త్రగా జాతీయ రహదారిపైకి వచ్చి కాపాడాలని కేకలు వేసింది.

A mentally unstable woman allegedly raped by three men

కాగా, పర్యాటక శాఖ బస్సులో వెళ్తున్న పలువురు ప్రయాణికులు ఆమెకు శాలువ అందజేసి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రగాయాలపాలైన బాధితురాలిని చికిత్స నిమిత్తం పోలీసులు కోహీర్ ఆస్పత్రికి తరలించారు.

బాధిత మహిళకు మతిస్థిమితం లేదని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జహీరాబాద్ పట్టణ సిఐ సాయిఈశ్వర్ గౌడ్ తెలిపారు.

English summary
A mentally unstable woman allegedly raped by three men in Medak district on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X