వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫార్మసీ విద్యార్థినిపై వేధింపులు: అసభ్యంగా ఫొటోలు..

|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి: ఓ వైద్య విద్యార్థినిని అసభ్యకరంగా ఫొటోలు తీసిన సహచరులు ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రంగరాయ వైద్య కళాశాల(ఆర్ఎంసి)లో ఆందోళనకు దారితీసింది. ఆర్ఎంసి విద్యార్థినులు ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.

అక్కడ తమ వ్యతిరేక వర్గం విద్యార్థినిని సెల్‌ఫోన్‌తో అసభ్యకరంగా ఫొటోలు తీసినట్లె తెలిసింది. పర్యటన అనంతరం తిరిగి కళాశాలకు వచ్చా ఈ ఫొటోలను ఒకరికొకరు ఎంఎంఎస్‌ల రూపంలో పంపించుకున్నారు. ఈ విషయం బాధిత విద్యార్థినికి తెలియడంతో ఆమె వర్గానికి చెందిన ఏడుగురు సహచర విద్యార్థినులు నిందితురాలిపై కళాశాల హాస్టల్‌లో దాడికి పాల్పడినట్లు తెలిసింది.

A pharmacy student allegedly harassed by her mates

దీంతో దాడికి గురైన విద్యార్థిని మద్దతుదారులు బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. తాము ఏవిధమైన ఫొటోలు తీయలేదని కావాలంటే సెల్‌ఫోన్‌ను చూసుకోవాలని అందజేశారు.

దీనిపై ప్రిన్సిపాల్ మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ రాఘవేంద్రరావు ఇరువర్గాల విద్యార్థినులను పిలిచి మాట్లాడారు. ఈ విషయమై ఇంతవరకు రాత పూర్వకంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు.

English summary
A pharmacy student allegedly harassed by her mates in Rangaraya medical college, in Kakinada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X