అనుమానం: భర్త వేధింపులతో నిప్పంటించుకున్న భార్య
పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని మైలార్దేవుపల్లి డివిజన్ వినాయక్నగర్ కాలనీలో నివాసముండే వెంకటేష్ హమాలీగా పని చేస్తున్నాడు. కొంతకాలంగా భార్య అంజమ్మ(28)పై అనుమానం పెంచుకున్నాడు. భర్త వేధింపులకు తోడు ఇంట్లో గొడవలు ఎక్కువయ్యాయి. ఇవన్నీ తట్టుకోలేక సోమవారం రాత్రి అంజమ్మ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
ఇరుగుపొరుగువాళ్లు తలుపులు పగులగొట్టి మంటలను ఆర్పి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మంగళవారం అంజమ్మ మృతి చెందింది. భర్త పెట్టే వేధింపులు, అనుమానం కారణాంగానే తాను ఆత్మహత్యకు పాల్పడ్డానని అంజమ్మ తన మరణ వాంగ్మూలంలో పేర్కొందని పోలీసులు తెలిపారు.
వాహనం బోల్తా: ఆరుగురి మృతి
విజయనగరం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు రాయగడకు 40కిలో మీటర్ల దూరంలో బాత్పూర్ సమీపంలో బొలెరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతులంతా ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్ గిరి జిల్లా కలిమెల గ్రామానికి చెందిన వారు.