హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫోన్‌లో పరిచయం పెంచుకుని యువతిని రేప్ చేశాడు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫోన్లో పరిచయం పెంచుకున్న యువకుడు నగరానికి చెందిన ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని డబీర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డబీర్‌పురా, సునార్ వీధికి చెందిన యువతి(15)ను వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన యువకుడు జహీరుద్దీన్(22) 8 నెలల క్రితం ఫోన్లో పరిచయం పెంచుకున్నాడు. సెప్టెంబర్ 24న బాలికను చేర్యాలకు తీసుకెళ్లి అక్కడే అత్యాచారం చేశాడు.

A youth allegedly raped his lover

ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకెళ్లగా తల్లిదండ్రులు అతడ్ని మందలించారు. దీంతో నిందితుడు బాలికను సిద్దిపేటలో ఉన్న ఆమె బంధువుల ఇంట్లో అప్పగించి వెళ్లిపోయాడు.

యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు ఆమెను ఇంటికి తీసుకెళ్ళారు. పోలీసులు బుధవారం చేర్యాలకు వెళ్లి నిందితుడిని నగరానికి తీసుకొచ్చారు. అతడిపై కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

English summary
A youth allegedly raped his lover, who belongs to Hyderabad, in Cheryal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X