హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపి, టి నిప్పుల కుంపటి: 50 మందికి పైగా మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

About 50 sunstroke deaths in AP and T
హైదరాబాద్/విశాఖ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో గురువారం భానుడి ఉగ్రరూపానికి ప్రజలు విలవిల్లాడారు. వడగాల్పులకు ఇరు రాష్ట్రాల్లో పలువురు మృత్యువాత పడ్డారు. ఎపిలోని విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో గురువారం వడదెబ్బకు పలువురు మృతి చెందారు.

వడగాలుల ప్రభావానికి ఆంధ్రప్రదేశ్‌లో నలభై మందికి పైగా, తెలంగాణలో పన్నెండు మంది వరకు మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లా అయితే కొలిమిని తలపిస్తోంది. తీవ్రమైన వడగాల్పులకు జిల్లాలో పదిమంది వరకు మృత్యువాత పడ్డారు. విజయనగరం, పశ్చిమ గోదావరి, విశాఖ, ఎస్పీఎస్ నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో పలువురు మృతి చెందారు.

వడదెబ్బకు ఖమ్మం జిల్లాలోని రెండు మండలాల్లో గురువారం ముగ్గురు మృతి చెందారు. చండ్రుగొండ మండల పరిధిలోని బెండాలపాటు, మద్దుకూరు గ్రామాలకు చెందిన పర్సా నారాయణ, కంచె జనార్దన్ వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. మెదక్, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో పలువురు మృతి చెందారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 44 డిగ్రీల వరకు ఉంటోంది.

English summary
About 50 sunstroke deaths in Andhra Pradesh and Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X