శ్వేతాబసు కేసు ట్విస్ట్: వాస్తవం లేదు, నిరూపిస్తామని..
హైదరాబాద్: తెలుగు సినీ నటి శ్వేతా బసు ఇటీవల ఓ హోటల్లో వ్యభిచారం కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను రెస్క్యూ హోంలో ఉంచారు. తాజాగా ఈ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది కూడా. వ్యభిచారం కేసులో తనను అన్యాయంగా ఇరికించారని శ్వేతాబసు చెప్పారు.
అయితే, వ్యభిచారం కేసులో తనను అన్యాయంగా ఇరికించారని శ్వేత బసు చెప్పినదాంట్లో వాస్తవం లేదని పోలీసులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. దానిని నిరూపించేందుకు సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ నిర్వాహకులను న్యాయస్థానం ముందు ప్రవేశ పెట్టనున్నారని సమాచారం.
కాగా శ్వేతా బసు కేసులో తాజాగా కొత్త కోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆమె ఈ కేసులో పట్టుబడిన హోటల్ గదిని ఫిల్మ్ అవార్డ్స్ నిర్వాహకులు బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. శ్వేతా బసు కూడా తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని వాదిస్తూ వస్తోంది. సంతోషం అవార్డ్స్ నిర్వాహకుల ఆహ్వానం మేరకే తాను ఆ హోటల్ గదిలోకి వెళ్లానని చెబుతోంది. డిఫెన్స్ లాయర్ ప్రదీప్ కుమార్ ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అందులో తాను గ్రాడ్యుయేషన్ విద్యార్థినని, సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు హోటల్కు వచ్చానని ఆమె న్యాయస్థానానికి తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. తనను అన్యాయంగా వ్యభిచారం కేసులో ఇరికించారని శ్వేత బసు ఆమె వాపోయిందని తెలుస్తోంది.