హైదరాబాద్ మారథాన్ విజేతలతో రహనే (పిక్చర్స్)
హైదరాబాద్: జంట నగరాల ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ - 2014 నిర్వహించింది. వరుసగా నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముంబై మారథాన్ తర్వాత దేశంలోనే రెండో అతి పెద్ద మారథాన్ గా పేరొందిన ఈ పరుగును ఎయిర్ టెల్, హైదరాబాద్ రన్నర్స్ సంయుక్తంగా నిర్వహించాయి. దేశ వ్యాప్తంగా పదివేల మంది ఔత్సాహికులు ఇందులో పాల్గోన్నారు.
ఈ ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్- 2014లో పాల్గోని గెలిచిన వారు నైకి ఫినిషర్ టీషర్ట్స్ని అందుకున్నారు. జూబ్లిహిల్స్ లోని నైకి రన్నింగ్ డెస్టినేషన్ స్టోర్లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో భారత క్రికెటర్ అజ్యింకా రహానే 400 మంది ఫినిషర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన టీ షర్ట్స్ని బహుకరించారు.
నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద హైదరాబాద్ నగర కమిషనర్ మహేందర్ రెడ్డి లాంఛనంగా జెండా ఊపి మారథాన్ రన్ ను ప్రారంభించారు. పీపుల్స్ ప్లాజా నుండి బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, హైటెక్ సిటీ మీదుగా గచ్చిబౌలి వరకు కొనసాగింది.
అజ్యింకా రహానే చేతుల మీదగా ఫినిషర్ టీషర్ట్స్
జూబ్లిహిల్స్ లోని నైకి రన్నింగ్ డెస్టినేషన్ స్టోర్లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో భారత క్రికెటర్ అజ్యింకా రహానే మాటా మంతీ.
అజ్యింకా రహానే చేతుల మీదగా ఫినిషర్ టీషర్ట్స్
ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ - 2014 విజేతలతో భారత క్రికెటర్ అజ్యింకా రహానే. జంట నగరాల ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ - 2014 నిర్వహించింది.
అజ్యింకా రహానే చేతుల మీదగా ఫినిషర్ టీషర్ట్స్
ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ - 2014 విజేతలతో భారత క్రికెటర్ అజ్యింకా రహానే. జంట నగరాల ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ - 2014 నిర్వహించింది.
అజ్యింకా రహానే చేతుల మీదగా ఫినిషర్ టీషర్ట్స్
జూబ్లిహిల్స్ లోని నైకి రన్నింగ్ డెస్టినేషన్ స్టోర్లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో భారత క్రికెటర్ అజ్యింకా రహానే మాటా మంతీ. 400 మంది ఫినిషర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన టీ షర్ట్స్ని బహుకరించారు.