కావాలనే దాడి, బాబు ప్రభుత్వం ఉందా: అంబటి ధ్వజం
దీంతో, ఇన్ని రోజుల పాటు ఈ ఏడుగురిని తనతో పాటే, తన నివాసంలో పెట్టుకున్నానని చెప్పారు. ఈ రోజు ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో వీరిని తీసుకుని ముప్పాళ్ల వెళుతుండగా రెండు, మూడు వాహనాలలో వచ్చిన కోడెల అనుచరులు తమపై దాడి చేశారన్నారు.
తమ పార్టీకి చెందిన ఏడుగురిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారన్నారు. సాక్షాత్తూ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తే ఇలాంటి అరాచకాలకు పాల్పడితే ప్రజాస్వామ్యం బతికే ఉందా? అనిపిస్తోందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బతికుందా? చచ్చిపోయిందా? అని అంబటి ప్రశ్నించారు.
దాదాపు 20 నుంచి 25 మంది తమపై దాడికి పాల్పడ్డారన్నారు. వారు కావాలనే దౌర్జన్యం చేశారన్నారు. ఎంపీపీ ఎన్నికలలో టీడీపీ దౌర్జన్యానికి పాల్పడే అవకాశముందని ముందే డీజీపీకి చెప్పినప్పటికీ రక్షణ కల్పించలేక పోయారన్నారు. అంతకుముందు కూడా కావాలనే ఎంపీపీ ఎన్నికను వాయిదా వేశారన్నారు. పరిస్థితులు చక్కబడే వరకు ఎన్నిక వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. తమ పైన దాడి చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలన్నారు.