జగన్కు కఠారి షాక్, ఫైర్: సైకిల్ గాలి తీసిన నారాయణ
హైదరాబాద్/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆ పార్టీ కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మాజీ మంత్రి కఠారి ఈశ్వర కుమార్ మంగళవారం రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఖరితో మనస్థాపం చెంది తాను రాజీనామా చేశానని ఆయన చెబుతున్నారు.
టిక్కెట్ను విద్యాసాగర్కు కాదని పార్థసారథికి అమ్ముకున్నారని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధనికుల పార్టీగా మారిందన్నారు. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన ఈశ్వర కుమార్ ఏ పార్టీలో చేరుతారో తెలియాల్సి ఉంది.
సైకిల్ గాలి తీసిన నారాయణ
ఖమ్మం పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. మంగళవారం ఆయన ఓ సైకిలు షాపు దగ్గరకు వెళ్లి... అక్కడున్న సైకిలు గాలి తీసేశారు. ఎందుకలా చేశారు అన్న మీడియా ప్రశ్నిస్తే... ఇక్కడ సైకిలుకి గాలి తీస్తే రాష్ట్ర వ్యాప్తంగా టిడిపికి గాలి పోతుందన్నారు.
ఓ వైపు తెలంగాణకు కట్టుబడి ఉన్నామంటూనే, మరోవైపు సమైక్య రాష్ట్రం కోసం... తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరించారన్నారు. అందువల్ల సైకిలు గాలి తీయాల్సిన అవసరం ఉందన్నారు.