కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాకింగ్: బాలుడిపై ఇద్దరు అత్యాచారం, సెల్‌ఫోన్లో వీడియో

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఇద్దరు దండగులు అసహజరీతిలో బాలుడి పన అత్యాచారానికి పాల్పడ్డారు. అతనికి కల్లు తాగించి, అత్యాచారానికి పాల్పడిన యువకులు.. దానిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని బీసీ కాలనీ సమీపంలో 13 ఏళ్ల బాలుడి పైన పందొనిమిదేళ్ల తోహైత్, ఇరవయ్యేళ్ల శేఖర్ అనే ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. దానిని సెల్‌ఫెన్‌లో రికార్డ్ చేసి మిత్రులకు పంపించి వికృత చేశ్టలకు పాల్పడ్డారు.

దీని పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితు బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 12వ తేదీన ఈ దారుణ సంఘటన జరిగింది. ఆ రోజు నిందితులు ఇద్దరు కల్లు తాకి వచ్చారు. తమ వెంట కల్లు సీసాలు కూడా తెచ్చారు. కల్లును బాలుడికి తాగించారు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డారు.

Boy raped at in Karimnagar district

తర్వాత రోజు బాలుని మేనమామ సెల్‌ఫోన్‌లో చూడగా.. ఈ సంఘటన బయటపడింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అనుమానాస్పదస్థితిలో వివాహిత..

నిజామాబాద్ జిల్లాలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన సంధ్య అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. కామారెడ్డి మండలం వడ్లూర్‌ గ్రామానికి చెందిన సంధ్య గత ఐదు సంవత్సరాల క్రితం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన రమేశ్‌తో వివాహం జరిపించారు. మృతురాలి భర్త రెండు రోజుల నుంచి గ్రామంలో లేడని మృతురాలి అత్త చెప్పారు.

సంధ్య శనివారం ఉదయం పొలం పనుల నిమిత్తం పంట పొలాల్లోకి వెళ్లిందని, అక్కడ అనుమానాస్పదస్థితిలో ఉండడంతో 108లో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని గ్రామస్థులు తెలిపారు. సంధ్యను హత్య చేసి ఆత్మ హత్యగా చిత్రీకరించారని సంధ్య పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. మృతురాలి బంధువులు ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చేశారు.

English summary
Boy raped at in Karimnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X