బాబుకు ఘనస్వాగతం: రాయ్పూర్ సందర్శన(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఛత్తీస్గఢ్ రాజధాని నయారాయపూర్ను సోమవారం సందర్శించారు. రాయ్పూర్కు చేరుకున్న చంద్రబాబు నాయుడు బృందానికి ఆ రాష్ట్ర మంత్రి రాజీవ్మూరత్ స్వాగతం పలికారు. నయారాయపూర్లో జాంజెజ్లేక్వ్యూ పాయింట్ను సందర్శించిన ఆయన అక్కడ సత్యసాయి సంజీవిని ఆస్పత్రిని సందర్శించారు.
అనంతరం రాయపూర్లోని భూగర్భ వ్యవస్థను పరిశీలించారు. చంద్రబాబు బృందం వెంట రాష్ట్ర మంత్రి రాజేష్ మున్నత్ తదితరులు ఉన్నారు. అనంతరం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు తోపాటు రాజధాని, ఇతర అంశాలపై వారు చర్చించారు. సిఎం చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, రావెల కిషోర్బాబు, పలువురు ఉన్నతాధికారులు చంద్రబాబు బృందంలో ఉన్నారు.
వీరితోపాటు తెలుగుదేశం పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, సిఎం రమేష్, గల్లా జయదేవ్, పారిశ్రామికవేత్తలు నవయుగ అధినేత విశ్వేశ్వరరావు, భారత్ బయోటెక్ అధిపతి కృష్ణా, ఎస్ఎంఎస్ ఫార్మా అధ్యక్షుడు రమేష్, శ్రీసిటీ ఛైర్మన్ శ్రీనిరాజు, సిఐఐ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు కన్నర్ బాబు వెంట ఉన్నారు.
చంద్రబాబు
ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతున్న ఛత్తీస్గఢ్ ఐజి అండ్ చీఫ్ సెక్రటరీ.
చంద్రబాబు
రాయ్పూర్కు చేరుకున్న చంద్రబాబు నాయుడు బృందానికి ఆ రాష్ట్ర మంత్రి రాజీవ్మూరత్ స్వాగతం పలికారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఛత్తీస్గఢ్ రాజధాని నయారాయపూర్ను సోమవారం సందర్శించారు.
చంద్రబాబు
నయారాయపూర్లో జాంజెజ్లేక్వ్యూ పాయింట్ను సందర్శించిన ఆయన అక్కడ సత్యసాయి సంజీవిని ఆస్పత్రిని సందర్శించారు.
చంద్రబాబు
అనంతరం రాయపూర్లోని భూగర్భ వ్యవస్థను పరిశీలించారు. చంద్రబాబు బృందం వెంట రాష్ట్ర మంత్రి రాజేష్ మున్నత్ తదితరులు ఉన్నారు.
చంద్రబాబు
ఏపి సిఎం చంద్రబాబు నాయుడు రాయ్పూర్లోని ఝాన్సీ సరస్సును పరిశీలిస్తున్న దృశ్యం.
ఝాన్సీ సరస్సు
ఏపి సిఎం చంద్రబాబు నాయుడు సందర్శించిన రాయ్పూర్లోని ఝాన్సీ సరస్సు.
చంద్రబాబు
ఏపి సిఎం చంద్రబాబు నాయుడు రాయ్పూర్ చిత్రపటాలను పరిశీలిస్తున్న దృశ్యం.
చంద్రబాబు
రాయ్పూర్లోని ఝాన్సీ సరస్సు వద్ద ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు