హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కళ్లల్లో కారం చల్లి కలెక్షన్ బాయ్ డబ్బు దోపిడీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదారాబాద్: బైక్‌పై వెళ్తున్న కలెక్షన్ బాయ్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు... కళ్లల్లో కారం చల్లి అతడి చేతిలో ఉన్న రూ. 2.77 లక్షల నగదు బ్యాగ్‌ను దొంగింలించిన ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

డీసీపీ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం సీతాఫల్ మండి మైలార్ గడ్డ నివాసి చిప్ప రాజేందర్(38) ట్రూప్ బజార్‌లోని మారుతి ఎలక్ట్రికల్స్‌లో కలెక్షన్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 25, 26 తేదీల్లో వసూలు చేసిన డబ్బు రూ 2.77 లక్షలను కార్యాలయంలో ఇవ్వకుండా తన ఇంటికి తీసుకెళ్లాడు.

Collection Boy money stolen in Nallakunta flyover

గురువారం తన వద్ద ఉన్న డబ్బును బ్యాగ్‌లో పెట్టుకోని సుల్తాన్ బజార్‌లోని మహేశ్ కో -ఆపరేటివ్ బ్యాంక్‌లో జమ చేసేందుకు ఉదయం 11.30నిమిషాలకి ఇంటి నుండి బైక్‌ప్ బయలుదేరాడు. 11.45నిమిషాలకు అడిక్ మెట్ ప్లైఓవర్ వద్దకు చేరుకోగా.. రెండు బజాజ్ పల్సర్ బైక్‌లపై వచ్చిన నలుగురు యువకులు రాజేందర్ బైకును ఢీకోట్టడమే కాకుండా.. అతని కళ్లలో కారం చల్లి బ్యాగ్ లాక్కుని పారిపోయారు.

అదే వీధిలో గణపతి మండపాన్ని ఏర్పాటు చేస్తున్న కొందరు యువకులు అడ్డుకునేందకు ప్రయత్నించగా.. దుండగులు వారిని బెదిరించి పారిపోయారు. వెంటనే బాధితుడు నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. సమాచారం తెలుసుకున్న డీసీపీ చంద్రశేఖర్, టాస్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ లింబారెడ్డి, కోటి రెడ్డి, సీసీఎస్ డీసీపీ బాలరాజు నల్లకుంట స్టేషన్‌కు వచ్చారు.

కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్దలానికి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లోని పుటేజీలను పరిశీలిస్తున్నారు.

English summary
Collection boy money stolen in nallakunta flyover. This robbery happened in hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X