పీకేసేవారు: కిరణ్పై దాడి నిప్పులు, బాబు యాత్ర పైనా
ముఖ్యమంత్రి తాను రాజీనామా చేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కొందరు రాజీనామాలు ఇచ్చినా వాటిని ఆమోదించే పరిస్థితి లేదన్నారు. ఇదంతా ఓ డ్రామా అన్నారు. జివోఎం ఏర్పాటు, చర్చలు, తెలంగాణ ప్రక్రియ కొనసాగింపు అన్ని జరిగిపోతున్నాయని అయినా ముఖ్యమంత్రి సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా కిరణ్ అధిష్టానానికి వ్యతిరేకమైతే ఎప్పుడో పీకేసే వారన్నారు.
సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ మట్టికొట్టుకుపోతుందనే ఉద్దేశ్యంతో కొత్త పార్టీ పెట్టడానికి సిఎం సిద్ధమవుతున్నారని, సమైక్యాంధ్రకు అనుకూలంగా పార్టీ పెట్టి సీట్లు గెలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా సోనియా గాంధీ కుమ్మక్కులో భాగమేనన్నారు.
తెలుగుదేసం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చే సమావేశాల్లో అవిశ్వాసం పెట్టగలరా అని సవాల్ చేశారు. బాబు చేపట్టనున్న ఆత్మగౌరవ యాత్ర ఎవరికోసమన్నారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతిస్తామన్నారు. అన్ని పార్టీలు సీమాంధ్ర ఉద్యమంలోకి రావాలన్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసి రావాలన్నారు.
బాబు, కిరణ్ల అండతోనే: భూమన
చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిల అండతోనే సోనియా విభజనకు మొగ్గుచూపారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. విభజనకు అనుకూలంగా ఢిల్లీలో బాబు దీక్ష చేశారని మండిపడ్డారు. రాష్ట్ర సమైక్యతకు విఘాతం కలిగించింది వారిద్దరే అన్నారు.