పెళ్లి మాట ఎత్తినందుకు: ప్రేయసిని హత్య చేసిన డ్రైవర్
కట్టంగూర్కు చెందిన ఎనమల యాదగిరి ఆర్టీసి అద్దె బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నల్లగొండ- సూర్యాపేట రూట్లో పనిచేసేవాడు. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన కందాళ శ్రీవిద్య (20) సూర్యాపేటలో పాలిటెక్నిక్ చదువుతోంది. ఆమె రోజు బస్సులో సూర్యాపేటకు వచ్చి వెళ్తుండేది. వీరి ఇరువురి మధ్య పరిచయం ఏర్పడి ఆతర్వాత ప్రేమగా మారింది.
గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడు యాదగిరిని వత్తిడి చేస్తుంది. ఇన్నేళ్లుగా వాయిదా వేస్తువస్తుండగా ఇటీవల ఒత్తిడిని తీవ్రం చేసింది. ఈనేపధ్యంలో గురువారం ఆయువతిని కట్టంగూర్లోని ఇందిరమ్మ కాలనీలో గల తన నివాసానికి యాదగిరి తీసుకువచ్చాడు. పెళ్లి విషయంపై ఇరువురి మధ్య తీవ్ర వాదులాట జరిగినట్లు తెలుస్తోంది.
పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన యాదగిరి శ్రీవిద్య గొంతుకోసి దారుణంగా హత్య చేసి పరారయ్యాఋ. హత్య విషయం రాత్రి పోలీసులకు సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.
నకిరేకల్ సిఐ రాఘవరావు, కట్టంగూర్ ఎస్ఐ పర్వతాలు మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. ప్రేమ వ్యవహరమే హత్య కారణమని భావిస్తున్నామని, పెళ్లి చేసుకునేందుకు నిరాకరించి హతమార్చినట్లు తమకు సమాచారం ఉందని పోలీసులు అంటున్నారు.