రోడ్డు ప్రమాదం: పెళ్లికి వెళ్తున్న యువ ఇంజనీర్ మృతి
పులివెందులలో వివాహం ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు స్వగ్రామం నుంచి బైక్పై బయలుదేరాడు. ప్రొద్దుటూరు చేరుకున్న తరుణంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ అతడ్ని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆంధ్రకేసరిరోడ్డులో బుధవారం ఉదయం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరు మండలం బంకచిన్నాయపల్లెకు చెందిన తిప్పలూరు రంగారెడ్డి, భారతిల కుమారుడు తిప్పలూరు సుభాష్కుమార్రెడ్డి (24). బీటెక్ పూర్తవడంతో ఉద్యోగం కోసం బెంగుళూరులోనే ఉంటున్నాడు. కాగా, అతని స్నేహితుని పెళ్లి పులివెందులలో జరుగుతుండగా, హాజరయ్యేందుకు సుభాష్కుమార్రెడ్డి బుధవారం బైక్పై ప్రొద్దుటూరుకు చేరుకుని, ఆంధ్రకేసరిరోడ్డులో వెళ్తూ లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదం ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.