ఈ ముగ్గురివే ఫోర్జరీ!: కొత్తపల్లి గీతపై పీఎస్లో ఫిర్యాదు
ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గీత ఎన్నికల అధికారులకు సమర్పించిన నామినేషన్ పత్రంలో ప్రతిపాదితుల సంతకాలను ఫోర్జరీ చేసినట్టుగా ఆరోపణలు వచ్చిన విషయం విదితమే.
ఈ విషయమై ఇటీవల రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్కు కూడా ఎమ్మెల్యే ఈశ్వరి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తమ సంతకాలను ఫోర్జరీ చేసిన గీతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పాడేరుకు చెందిన సిహెచ్ గోపాల కృష్ణ, హేమ కుమార్, గౌరీశంకర రావు స్థానిక ఎస్సైకి ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.
గీత ఎన్నికల అధికారులకు దాఖలు చేసిన నామినేషన్ పత్రం నకలు, తమ ఓటరు గుర్తింపు కార్డు వంటి వివరాలను వారు అందచేశారు. గీత ఫోర్జరీ సంతకాలు చేసినట్టుగా అందిన ఫిర్యాదును ఎస్సై వెంటనే ఎఎస్పి దృష్టికి తీసుకువెళ్లి రూరల్ ఎస్పితో చర్చించారు.