హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేప్ జరిగిందని వస్తే, అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Girl complaints in HRC on SI
హైదరాబాద్: ఎస్సై తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఓ బాలిక మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. తన పైన అత్యాచారం జరిగిందని, కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లాలోని ఎస్సైని కోరగా ఆయన ఫిర్యాదు పట్టించుకోకుండా అసభ్యంగా ప్రవర్తించారని బాలిక ఆరోపించింది.

భార్య ఆత్మహత్య చేసుకోవడంతో భర్త కూడా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నాగరాజుకు, ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన మాధవితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది.

వారికి ఇద్దరు సంతానం ఉంది. వారు పర్చూరులో ఉంటున్నారు. నాగరాజు ఒక హోటల్లో వంట మాస్టారుగా పని చేస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దాంతో మాధవి ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది.

భార్య మృతిని భర్త తట్టుకోలేకపోయాడు. నాగరాజు కూడా స్థానిక ప్రకాశ్ నగర్ ఆంధ్రా బ్యాంకు సమీపంలోని రైల్వే ట్రాకు పైన మధ్యాహ్నం నుండి నల్లపాడు వెళ్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో వారి పిల్లలు అనాథలయ్యారు.

English summary

 A girl complainted in Human Rights Commission on SI for misbehaving with her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X