అమ్మాయిపై గ్యాంగ్ రేప్, బస్సు కింద పడి మృతి
హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని గూడూరు మండలం కొల్లాపూర్ శివారులో దారుణ సంఘట జరిగింది. గడ్డి తండాలో పదమూడేళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక స్కూలు నుంచి వస్తున్న సమయంలో ఆటోలో వస్తున్న ముగ్గురు యువకులు బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులను పట్టుకోవాలంటూ బాలిక బంధువులు పోలీస్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.
హైదరాబాద్లోని బేగంపేటలో సోమవారం ఉదయం ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మృతి చెందాడు. ఈ ఉదయం బేగంపేటలో భారీగా ట్రాఫిక్ జాం అవడంతో ఆర్టీసీ బస్సును డ్రైవర్ వేరే రూట్కు మళ్లించారు.
బస్సు వేరే రూట్లో వెళ్తుందన్న ఆందోళనతో ఓ ప్రయాణికుడు బస్సులో నుంచి దూకడంతో బస్సు వెనుక టైర్ కిందపడి అక్కడికక్కడే మరణించాడు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.