ఆ టీచర్ని ఉరి తీయాలి: సి. రామ చంద్రయ్య
తూర్పుగోదావరి జిల్లా గ్రీన్ ఫీల్డ్ అంధుల పాఠశాల ఉదంతంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సోమవారం చర్చ జరిగిన విషయం తెలిసిందే. అంధ విద్యార్దులను కిరాతకంగా కొట్టిన ఉపాధ్యాయుడిని ఉరి తీయాలని మాజీ మంత్రి సి. రామ చంద్రయ్య డిమాండ్ చేసారు. దీనిపై స్పందించిన మంత్రి గంటా శ్రీనివాసరావు గ్రీన్ ఫీల్డ్ అంధుల పాఠశాల గుర్తింపు రద్దు చేశామని, అందుకు బాధ్యులైన వారిని అరెస్టు చేశామని చెప్పారు.
అచ్చంపేట జంక్షన్ సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ అంధుల పాఠశాలలో కరస్పాండెంట్ కేవీ రావు, ప్రిన్సిపల్ శ్రీనివాస్ ముగ్గురు విద్యార్దులను అతి కిరాతకంగా కొట్టడంతో వీరిని అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం ఆగ్రహాం వ్యక్తం చేసిన విషయం చేసిన సంగతి తెలిసిందే.
దుండగుల చెర నుంచి తప్పించుకున్న బాలిక
నల్గోండ జల్లా మిర్యాలగూడ గాంధీనగర్లో ఒక బాలికను దండుగులు అపహరించగా వారి నుండి తప్పించుకోని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుండగులు బాలికను కారులో ఎత్తుకెళ్లారు. వారి చెరనుంచి తప్పించుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.