వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీ జగన్ ఎమ్మెల్యేపై ఏపీ టీడీపీ ఎంపీ దాడి: హరీష్ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఖమ్మం జిల్లా శాసన సభ్యుడు తాటి వెంకటేశ్వర రావు పైన దాడిని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు శుక్రవారం ఖండించారు. ఎమ్మెల్యేకు హరీష్ రావు ఫోన్ చేసి పలకరించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, తాటి వెంకటేశ్వర్లు పైన మాగంటి అనుచరుల దాడిని నిరసిస్తూ ఖమ్మంలోని మయూరి సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

గురువారం పోలవరం ముంపు మండలం అయిన ఖమ్మం జిల్లా కుక్కునూరు మండలంలో గురువారం ఆంధ్రా అధికారులు పర్యటించడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ నేతృత్వంలో ఆ జిల్లా ఉన్నతాధికారులు, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, పోలవరం ఎమ్మెల్యే శ్రీనివాస రావు కుక్కునూరులో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Harish Rao condemns attack on YSR Congress MLA

ఈ సమయంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు జై తెలంగాణ అంటూ సమావేశ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న ఏలూరు ఎంపి మాగంటి బాబు అనుచరులు వారిని అడ్డుకున్నారు. జై తెలంగాణ నినాదాలకు వ్యతిరేకంగా జై ఆంధ్రా అంటూ వారు కూడా బిగ్గరగా నినదించారు. ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును, కార్యకర్తలను నెట్టుకుంటూ ముందుకు వచ్చారు.

మాగంటి బాబు అనుచరులు ఒక్కసారిగా ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై పిడిగుద్దులు కురిపించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హుటాహుటిన కుక్కునూరు వచ్చారు. ఎమ్మెల్యే తాటితో కలిసి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

English summary
Telangana Minister Harish Rao condemned attack on YSR Congress MLA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X