హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బాబు వల్లే: అశోక్, తెలుసని
ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ.. దివంగత నేత ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడే తెలుగు వారికి గుర్తింపు తెచ్చారని అన్నారు. ఉద్యోగుల హృదయాల్లో చంద్రబాబుకు ఉన్నత స్థానం ఉందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయాలు ఉద్యోగులను బయపెట్టేలా ఉండకూడదని కోరారు. ఏపి అభివృద్ధి కోసం ఆదివారాలు కూడా పని చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని అశోక్ బాబు తెలిపారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను దశలవారీగా క్రమబద్దీకరించాలని ఆయన చంద్రబాబును కోరారు. కుటుంబ పెద్దగా ఉద్యోగుల సమస్యలను చంద్రబాబు పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య కార్డులను త్వరగా మంజూరుచేయాలని కోరారు. హైదరాబాద్లో పని చేయడానికి తాము సిద్ధమేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయ కుట్రతోనే రాష్ట్రాన్ని విడగొట్టారని అన్నారు.
అవినీతిపై చంద్రబాబు కఠినంగా వ్యవహరిస్తారని చెప్పని అశోక్ బాబు, ఏసిబికి చిక్కిన చిరుద్యోగుల ఆవేదనను గమనించాలని కోరారు. ఏపిలో పని చేసే తెలంగాణ ఉద్యోగులకు ఇబ్బందులు ఉండవని తెప్పారు. ఉద్యోగుల విరమణ వయస్సును 60కి పెంచడం సంతోషకరమని అశోక్ బాబు అన్నారు. ఏపిని ఎలా అభివృద్ధి చేయాలో చంద్రబాబుకు తెలుసని చెప్పారు. పొరుగుసేవల విధానాన్ని రద్దు చేయాలని చంద్రబాబును ఆయన కోరారు.