సింగపూర్ పర్యటనలో ఎంతో నేర్చుకున్నా: కెసిఆర్
హైదరాబాద్: సింగపూర్, మలేసియా పర్యటనల్లో తాను ఎంతో నేర్చుకున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఈ పర్యటనల అనుభవం పనికి వస్తుందని చెప్పారు. త్వరలో ఉత్తమమైన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని తెలిపారు.
బుధవారం ఆయన శిల్పా కళావేదికలో అపోలో ఆస్పత్రి వార్షికోత్సవాల్లో సిఎం కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. దేశంలో పేరున్న ఆస్పత్రుల్లో అపోలో కూడా ఉండటం హైదరాబాద్కు గర్వకారణమని చెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమ ఆస్పత్రిగా అపోలో ఎదగాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. మరిన్ని జిల్లాలకు అపోలో ఆస్పత్రి సేవలు అందించాలని కోరారు.
హైదరాబాద్లో హెల్త్ టూరిజం వస్తే మేజర్ కాంట్రిబ్యూషన్ ఉంటుందన్నారు. అపోలో ఆస్పత్రికి 150 దేశాల నుంచి రోగులు వస్తున్నారని తెలిపారు. హైదరాబాద్కు బెస్ట్ ఇండస్ట్రీ పాలసీని తీసుకొస్తామని చెప్పారు. 10 లక్షల ఎకరాల్లో ఇండస్ట్రీస్ నిర్మించే అవకాశం ఉందని తెలిపారు.
బెస్ట్ ఇండస్ట్రీ పాలసీని అమలు చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50 శాతం ఇండస్ట్రీస్ హైదరాబాద్కు వస్తాయని అన్నారు. బెంగళూరు, చెన్నైల కంటే హైదరాబాద్ పెద్ద నగరమని సమగ్ర సర్వేలో తేలందని చెప్పారు.