అనవసరం: సానియా మీర్జాపై మంచు లక్ష్మీప్రసన్న
హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా తాను సానియా మీర్జాకు తాను పూర్తి మద్దతిస్తున్నానని, సానియా పైన వివాదం సరికాదని ప్రముఖ నటి, నిర్మాత లక్ష్మీ ప్రసన్న అభిప్రాయపడ్డారు. సానియా మీర్జాను తెలంగాణ అంబాసిడర్గా నియమించడంతో తెలంగాణ బీజేపీ నేత, శాసన సభాపక్ష నేత లక్ష్మణ్, మరో నేత ఎన్వీవీఎస్ ప్రభాకర్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.
సానియాపై వ్యాఖ్యలకు ఇక ముగింపు పలకాలని అభిప్రాయపడ్డారు. మన క్రీడాకారులను మనం కించపర్చుకోరాదన్నారు. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసడర్గా సానియా తన పాత్రకు న్యాయం చేయగలదని నమ్మకముందన్నారు. టెన్నిస్లో భారత్కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా సానియా తన జీవితాన్ని ఆటకు అంకితం చేశారన్నారు.
దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు సానియా మీర్జా నియామకాన్ని తప్పుపడుతుండగా.. మరికొందరు సమర్థిస్తున్నారు. అయితే, ఈ వివాదానికి బీజేపీ జాతీయ నేతలు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల ప్రకాశ్ జవదేకర్, ఆదివారం వెంకయ్య నాయుడులు కూడా దీనిపై స్థానిక నేతలకు భిన్నంగా స్పందించారు. సానియా మీర్జా మంచి క్రీడాకారిణి అని కితాబిచ్చారు. అయితే, వెంకయ్య ఈ వ్యవహారంలో తలదూర్చేందుకు ఇష్టపడలేదు. పరోక్షంగా మాత్రం ప్రభుత్వం చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
సానియా మీర్జా నియామకం పైన బీజేపీ నేతలే కాకుండా కాంగ్రెసు నేతలు కూడా విమర్శలు చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ ఇచ్చే విషయంలో స్థానికత చూస్తున్న ప్రభుత్వం.. అంబాసిడర్గా నియమించిన, తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకోని సానియా విషయంలో స్థానికతను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.