హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెదిరించి ఎత్తుకెళ్లి: యువతిపై జవాన్ల అత్యాచారయత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

girl
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ యువతిపై అత్యాచారయత్నం చేసిన కేసులో ముగ్గురు జవాన్లను పోలీసులు అరెస్టు చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. సికింద్రాబాదులోని ఓ యువతిపై ముగ్గురు ఆర్మీ జవాన్లు అత్యాచారానికి యత్నించినట్లు తుకారాంగేట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. అక్కడి తన స్నేహితుడిని బెదిరించి యువతిని ఎత్తుకెళ్లి వారు ఈ కిరాతకానికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది.

విశాఖపట్నం పెందుర్తి పరిధిలోని చినముపిడివాడలో ఆదివారం ముగ్గురు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో గణేష్ అనే విద్యార్థి తప్పించుకున్నాడు. ఘటనలో గణేష్ తండ్రి, తాతయ్య, నానమ్మలు మరణించారు.

కర్నూలు జిల్లా డోన్ మండలం ఓబుళాపురం మిట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు గ్రానైట్ లారీకి నిప్పు అంటించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పింది.

బస్సు ప్రమాదంలో ఇరవై మృతదేహాల గుర్తింపు

ఐదు రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల్లో ఇరవై మందిని గుర్తించారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు చెప్పారు.

English summary
Three army jawans facing case at Hyderabad for allegedly attempt rape on girl.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X