విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోరిక తీర్చాలని స్త్రీ పిల్లల కిడ్నాప్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఇద్దరు బాలురను అపహరించిన వ్యక్తిని విశాఖపట్నం ఒకటో టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. డిసిపి శ్రీనివాసులు శుక్రవారంనాడు కమిషనరేట్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. వన్ టౌన్‌లోని పండా వీధిలో గాంధీ (35), అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న అతడి ఇంటికి సమీపంలోనే కళ (33) అనే మహిళ నివసిస్తోంది.

ఆమెకు ఇద్దరు కుమారులున్నారు. వారితో గత కొంత కాలంగా గాంధీ పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి ఈ నెల 17వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు అనకాపల్లి తీసుకుని వెళ్లాడు. అక్కడి నుంచి వియవాడ వెళ్లాడు. మార్గ మధ్యంలో కళకు ఫోన్ చేశాడు.

తాను చెప్పిన ప్రదేశానికి వచ్చి తన కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. అలా చేయకపోతే పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. దీంతో అదే రోజు రాత్రి ఒకటో పట్టన పోలీసులకు కళ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు ఫోన్‌లో గాంధీతో కళను మాట్లాడించారు.

ప్రబుద్ధుడి జాడ కనుక్కున్నారు...

ప్రబుద్ధుడి జాడ కనుక్కున్నారు...

కళతో ఫోన్ చేయించి ఎక్కడికి రావాలో కనుక్కోమన్నారు. గాంధీ చెప్పిన ప్రదేశానికి కళతో పాటు మారు వేషాల్లో ఉన్న పోలీసులు విజయవాడ వెళ్లారు. గాంధీని పట్టుకున్నారు.

పిల్లల అప్పగింత

పిల్లల అప్పగింత

ఇద్దరు పిల్లలను పోలీసులు తల్లి కళకు అప్పగించారు. గాంధీని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను డిసిపి అభినందించారు.

కత్తి స్వాధీనం

కత్తి స్వాధీనం

నిందితుడి నుంచి పోలీసులు ఆటోను, సెల్‌ఫోన్‌ను, చిన్నపాటి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పిల్లలు యశ్వంత్ (9), జగన్ (7) క్షేమంగా బయటపడ్డారు.

మీడియా సమావేశంలో...

మీడియా సమావేశంలో...

మీడియా సమావేశంలో ఎస్సై వాసుదేవ రావు, ఎఎస్సై ఎన్‌విఎం రాజు, సిబ్బంది ఎస్ బాలకృష్ణ, డి రాంబాబు, కెవివై రాజు, దిలీప్ పాల్గొన్నారు.

English summary
An auto driver kidnapped two children from Visakhapatnam. The auto driver Gandhi has been arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X