కొడంగల్: గుర్నాథ్ రెడ్డి పోటీ, రేవంత్ రెడ్డికి గండమే
ఇటీవల గురునాథ్రెడ్డి తెరాసలో చేరి పోటీకి దిగడంతో ఫలితాన్ని అంచనా వేయడం కష్టంగా మారింది. తొలి అసెంబ్లీ ఎన్నికలు 1952లో అనంతరెడ్డి, 1957లో అచ్యుతారెడ్డి, 1962లో రుక్మారెడ్డి, 1967లో అచ్యుతారెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలుపొందుతూ వచ్చారు. కాగా 1972 సంవత్సరంలో జరిగిన ఎన్నికలు స్థానికుల మధ్యలో జరిగాయి. 1972లో స్వతంత్ర అభ్యర్థిగా నందారం వెంకటయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1978లో గురునాథ్రెడ్డి స్వతంత్ర అభ్యిర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత గురునాథ్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా, నందారం వెంకటయ్య అప్పట్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుండి గురునాథ్రెడ్డి, నందారం కుటుంబం మధ్య రాజకీయ పోరు కొనసాగింది. 1996లో నందారం వెంకటయ్య మృతి కారణంగా తన తనయుడు సూర్యనారాయణ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టిడిపి తరపున సరైన అభ్యర్థి లేని కారణంగా 1999, 2004లో గురునాథ్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
2009లో కూడా అదే పరిస్థితి వస్తుందని గ్రహించి తెలుగుదేశం పార్టీ రేవంత్రెడ్డిని బరిలోకి దించింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన గురునాథ్రెడ్డిపై రేవంత్రెడ్డి ఐదువేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. అయితే, ఈసారి మాత్రం గుర్నాథ్ రెడ్డికి రాజకీయ అనుభవానికి, తెలంగాణవాదం తోడు అవుతోంది. మొత్తం మీద ముక్కోణపు పోటీ రసవత్తరంగా సాగుతోంది.