చిరుకు కృష్ణంరాజు చురక, గీతకు అరెస్టు వారెంట్
విజయవాడ: కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిపై బీజేపీ నేత కృష్ణంరాజు ఘాటైన విమర్శిల్ని చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన మాట్లాడుతూ, 100 రోజుల పాలనలో దేశంలో పరిస్థితులు మారిపోవడానికి ఇదేమైనా సినిమానా అని ప్రశ్నించారు. డిపాజిట్లు కూడా దక్కని కాంగ్రెస్ నేతలు, బీజేపీ, టీడీపీలను విమర్శించడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతాకు నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ అయింది. చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ కోర్టు సోమవారం ఆమెకు ఈ వారెంట్ జారీ చేసింది. కొత్తపల్లి గీత, విశ్వేశ్వరయ్య ఇన్ఫ్రాస్టక్చర్ సంస్ద నుంచి రుణం తీసుకున్నారు.
తీసుకున్న రుణం చెల్లించే భాగంలో చెక్ ఇవ్వగా అది బౌన్స్ కావటంతో బ్యాంక్ న్యాయస్దాన్ని ఆశ్రయించింది. ఐతే కేసు విచారణ నిమిత్తం కొత్తపల్లి గీత కోర్టుకు హాజరు కాకపోవటంతో కోర్టు వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై నాన్ బెయిల్బుల్ వారెంట్ను న్యాయస్దానం ఉపసంహరించుకుంది. చెక్ బౌన్స్ కేసులో ఈరోజు ఆమె ఎర్రమంజిల్ కోర్టుకు హాజరయ్యారు. తనపై అరెస్టు వారెంట్ను ఉపసంహరించుకోవాలని అమె కోర్టును కోరారు. గీత అభ్యర్దన మేరకు నాన్ బెయిల్బుల్ వారెంట్ను కోర్టు ఉపసంహరించుకుంది.