స్పీకర్గా మధుసూదనాచారి: కెసిఆర్ హ్యాపీ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్గా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభంకాగానే ప్రోటెం స్పీకర్ జానారెడ్డి.. స్పీకర్గా మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. స్పీకర్ మధుసూదనాచారికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రులు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.
తెలంగాణ ఉద్యమ నిర్మాణం, వ్యూహరచనలో మధుసూదనాచారి అందించిన సహకారాన్ని మరువలేనని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైన మధుసూదనాచారికి కెసిఆర్ అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తమ సహచర్యంలో తనకు ఎన్నో అద్భుతమైన అనుభూతులున్నాయని గుర్తుచేసుకున్నారు.
30 ఏళ్లపాటు కలిసి రాజకీయాల్లో ఉన్నామని, ఉద్యమంలోనూ ఆయన తన వెన్నంటి ఉన్నారని కెసిఆర్ చెప్పారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారు తెలంగాణ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే తన హృదయం పులకించిందన్నారు. తెలంగాణ ఉద్యమకారులే అసెంబ్లీని నడుపుతున్న సన్నివేశం మరుపురాని మధురమైన ఘట్టమని కెసిఆర్ అన్నారు. ఎలాంటి భేషజాలు పోకుండా సత్వర అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
అసెంబ్లీ స్పీకర్గా మధుసూదనాచారి
తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్గా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
స్పీకర్గా మధుసూదనాచారి
మంగళవారం ఉదయం తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభంకాగానే ప్రోటెం స్పీకర్ జానారెడ్డి.. స్పీకర్గా మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
స్పీకర్గా మధుసూదనాచారి
స్పీకర్ మధుసూదనాచారికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రులు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.
స్పీకర్గా మధుసూదనాచారి
తెలంగాణ ఉద్యమ నిర్మాణం, వ్యూహరచనలో మధుసూదనాచారి అందించిన సహకారాన్ని మరువలేనని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.
మధుసూదనాచారికి అభినందనలు
తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైన మధుసూదనాచారికి తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు.
ఈటెల అభినందనలు
తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైన మధుసూదనాచారికి మంత్రి ఈటెల రాజేందర్ అభినందనలు తెలిపారు.
హరీశ్తో ఆత్మీయ ఆలింగనం
తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైన మధుసూదనాచారికి మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో ఆత్మీయ ఆలింగనం చేసుకున్న హరీశ్.
బాధ్యతలు స్వీకరిస్తూ..
తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైన మధుసూదనాచారి బాధ్యతలు తీసుకుంటున్న దృశ్యం.
కుటుంబ సభ్యులతో..
తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైన మధుసూదనాచారి బాధ్యతలు తీసుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో.
కుటుంబ సభ్యులతో..
తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైన మధుసూదనాచారి బాధ్యతలు తీసుకున్న అనంతరం కుటుంబ సభ్యులతో.